టీటీడీకి అజ్ఞాత భక్తుడి భారీ విరాళం..

115
ttd
- Advertisement -

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని అరుదైన ఆభరణాన్ని అందించాడు అజ్ఞాత భక్తుడు. స్వామి వారికీ ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి., వరద హస్తాలను ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్ కు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు.

5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి రూ 3.5 విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి., వరద హస్తాలను అలంకరించనున్న శ్రీవారి ఆలయ అర్చకులు. భక్తితో చేసిన విరళమని., ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో… దాత సమాచారాన్ని గోప్యంగా ఉంచింది టీటీడీ.

- Advertisement -