భారీ ధరకు అమ్ముడుపోయిన స్కంద

36
- Advertisement -

టాలీవుడ్ ప్రేక్ష‌కుల దృష్టంతా ఇప్పుడు సెప్టెంబ‌ర్ నెల మీదే ఉంది. ఖుషి సినిమాతో మొద‌లుకానున్న సెప్టెంబ‌ర్, ఆ త‌ర్వాత వారంలో మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి రిలీజ్ కానుంది. సెప్టెంబ‌ర్ 15న రామ్-బోయ‌పాటి స్కంద సినిమా రానుంది. ఇక నెలాఖ‌రులో ప్ర‌భాస్ స‌లార్ సినిమా రిలీజ్ అవుతుంది. మొత్తానికి సెప్టెంబ‌ర్ నెల మొత్తం మూవీ ల‌వ‌ర్స్‌కు మంచి సినిమాల‌తో పండ‌గ‌నే చెప్పాలి. అయితే, ప్ర‌భాస్ స‌లార్ తర్వాత సెప్టెంబ‌ర్ 15న రాబోతున్న రామ్ స్కంద పైనే అందరి అంచనాలు ఉన్నాయి. అందుకే, స్కంద కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్నట్టు, స్కంద రిలీజ్‌కు ముందే.. శాటిలైట్స్, డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం. ఈ సినిమా రైట్స్‌ను స్టార్ గ్రూప్ రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన ‘డుమ్మారే డుమ్మా డుమ్మారే..’ అంటూ సాగే లిరికల్‌ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. చిత్ర బృందం ఊహించని విధంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Also Read:ఇప్పుడేందుకు ఈ కపటప్రేమ.. మోడీజీ !

పైగా యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ గా రామ్ పోతినేని ఈ సినిమాలో వెరీ పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఎలాగూ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా. పైగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించిన సినిమా ఇది. దీనికితోడు శ్రీలీలతో పాటు సయీ మంజ్రేకర్‌ కూడా హీరోయిన్ గా నటించింది. సో.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది. కాకపోతే సినిమా మాత్రం బాగా రాలేదు అని టాక్ కూడా ఉంది.

Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?

- Advertisement -