సెలవుపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత!

46
- Advertisement -

జీహెచ్ఎంసీలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత సెలవులో వెళ్లారు. టీజీవో ప్రెసిడెంట్ గా ఉన్న మమత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన హవా కొనసాగించారు. గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలను నిర్వహించారు. అదే ప్రాంతంలో జోనల్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టారు. ఆ తరువాత జీహెచ్ఎంసీలో తనకు తిరుగులేదనే విధంగా కొనసాగారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బల్దియాలోనే ఉన్నారు.

గతంలో మమతను కూకట్ పల్లి జోన్ నుంచి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, గంటల వ్యవధిలోనే తిరిగి అదే స్థానానికి బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే ఆమె సెలవులో వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read;నో టికెట్.. వారిలో టెన్షన్?

- Advertisement -