గ్రీన్ ఛాలెంజ్ స్వీక‌రించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కోల‌న్

247
GREEN challeange
- Advertisement -

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. తాజాగా హిట్ మూవీ ద‌ర్శ‌కుడు శైలేష్ కోల‌న్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోని మొక్క‌లు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హిట్ సినిమా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు తన కార్యాలయంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శైలేష్ కోలన్ మాట్లాడుతూ…రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో నీను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం మనందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసంద‌ర్భంగా మ‌రో ముగ్గురికి మొక్క‌లు నాటాల్సిందిగా స‌వాల్ విసిరారు. 1)రోహిణి శర్మ హీరోయిన్ 2)ప్రశాంతీ నిర్మాత 3)రవివర్మ నటుడు లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -