విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురు…

137
Vijayashanti
- Advertisement -

బీజేపీ నేత విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు స్టే ఇవ్వాలన్న విజయశాంతి పిటిషన్ పై హైకోర్టు నిరాకరించింది. కోకాపేట 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు స్టే నిరాకరించింది.

భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టివేయాలని విజయశాంతి కోరగా జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంకు ఏర్పాటుపై పూర్తిస్థాయి వాదనలు వింటామని తెలిపింది.

- Advertisement -