సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

227
telangana high court
- Advertisement -

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పి ఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన పిల్ కొట్టివేసిన హైకోర్టు..సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని పేర్కొంది.కేవలం నూతన నిర్మాణానలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని సోలిసీటర్ జనరల్ పేర్కొన్నారు.

నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.ల్యాండ్ ప్రిపరేషన్ లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు……కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసీటర్ జనరల్ వాదనను ఏకీభవించింది.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందన్న హైకోర్టు పేర్కొంది..కోవిడ్ 19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాలన్న హైకోర్టు..పిటీషన్ కొట్టివేసింది.

- Advertisement -