పూజా హెగ్డె @5

730
pooja-hegde
- Advertisement -

ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ఇప్పుడు టాలీవుడ్ లో మెస్ట్ సక్సెస్ పుల్ హీరోయిన్ గా నిలిచిపోయింది. ముకుంద సినిమాలో పూజా పాత్రకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నాగచైతన్యతో ఒక లైలాకోసం సినిమాలో నటించింది. ఈమూవీ తర్వాత అమ్మడుకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే పూజా నటించిన సినిమా బాలీవుడ్ లో బోల్తా కొట్టడంతో కొద్ది రోజులు అవకాశాలు రాలేదు. అటు తెలుగు..ఇటు హిందీ అవకాశాలు రాకపోవడంతో కొద్ది రోజులు ఇబ్బందిపడింది. అంతలోనే అల్లు అర్జున్ సరసన అవకాశం రావడంతో అమ్మడు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. అల్లు అర్జున్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో పూజా హీరోయిన్ గా నటించింది.

ఈమూవీ విజయం సాధించడంతో పూజాకు అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈమూవీకి భారీ విజయాన్ని సాధించింది. అనంతరం మహేశ్ బాబుతో మహర్షి సినిమాలో నటించగా..ఈమూవీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత గద్దలకొండ గణేశ్, హౌస్ ఫుల్ 4 (హిందీ) చిత్రాలతో పాటు ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఐదు వరుస హిట్లు ఆమె ఖాతాలో పడ్డాయి. వరుసగా ఐదు విజయాలు సాధించి నెం1 హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం పూజా ప్రభాస్, అఖిల్ సినిమాల్లో నటిస్తుంది.

- Advertisement -