మొక్కలు నాటిన హీరో రాజ్ తరుణ్..

242
hero raj tarun
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేడు సినీ హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని హీరో రాజ్ తరుణ్. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గచ్చిబౌలిలో మొక్కలు నాటిన హీరో రాజ్ తరుణ్… అనంతరం (సినీ హీరోయిన్ హేమల్ ఏంగఏ, ఆర్టిస్ట్ మధునందన్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -