సీసీసీకి హీరో గోపిచంద్ విరాళం..

280
gopi chand
- Advertisement -

సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు,నిర్మాతలు,హీరోయిన్లు విరాళాలు అందించగా తాజాగా హీరో గోపిచంద్ ముందుకొచ్చారు.

రూ. 10 లక్షల విరాళాన్ని సీసీసీకి అందజేశారు గోపిచంద్. దీంతో పాటు ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న రెండు వేల కుటుంబాలకు ఇప్పటికే నిత్యావసర సరుకులు అందజేసిన గోపీచంద్.. 1,500 మంది అనాథలకు రెండు నెలలపాటు అన్నదానం చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా పేద కళాకారులకు సాయం చేస్తున్నారు.

- Advertisement -