తలైవాకు భారీ సెక్యూరిటీ..!

221
- Advertisement -

తమిళ తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్‌ భారీ సెక్యూరిటీ మధ్య షూటింగ్‌ జరుపుకుంటున్నాడు. ఉన్నట్టుండి రజినీకి అంత సెక్యూరిటీ ఎందుకంటారా..ఇటీవలకాలంలో ఆగంత‌కులు షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి రచ్చ చేయ‌డం లేదంటే, లొకేష‌న్ ప్రాప‌ర్టీస్‌ని ధ్వంసం చేయ‌డం జ‌ర‌గుతూఉంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందంతో పాటు స్టార్ హీరోల‌కి ప్ర‌భుత్వం భారీ సెక్యూరిటీ క‌లిపిస్తుంది. అతి త్వ‌ర‌లో పూర్తి రాజ‌కీయాల‌లోకి రానుండ‌గా, ఆయ‌నకి భ‌ద్ర‌త మ‌రింత పెంచారు.

rajinikanthఅయితే తాజాగా 165 చిత్రంగా రజినీ ‘పేటా’ రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ లక్నోలో జరుగుతోంది. వారణాసిలోనూ కొన్ని రోజుల పాటు షూటింగ్‌కి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఉత్త‌ర ప్రదేశ్ ప్ర‌భుత్వం త‌లైవాకి 25 మంది పోలీసులతో కూడిన భారీ సెక్యూరిటీని కల్పించింది. అంతేకాదు ఆయ‌న ఉండే ప్రాంతంలో ఎప్పుడూ ఓ మిలిట‌రీ పోలీసు వ్యాన్ ప‌హారా కాస్తుందని సమాచారం.

ఈ మూవీ జిగ‌ర్తాండ ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు డైరెక్షన్ లో రానుంది. ఇక ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ర‌జ‌నీ న‌టించిన చిత్రం 2.0 న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్ర టీజ‌ర్ వినాయ‌క చవితి శుభాకాంక్ష‌ల‌తో సెప్టెంబర్ 13న విడుద‌ల కానుంది.

- Advertisement -