- Advertisement -
రాష్ట్రంలో ఈ నెల 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ నెల 22 నాటికి ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారనున్నదని వెల్లడించింది. వర్షాలకు తోడు చలి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది.
- Advertisement -