ప్చ్.. ప్లాప్ కాంబినేషన్ పై భారీ బడ్జెట్?

23
- Advertisement -

హీరో గోపీచంద్ కి ‘రామబాణం’ రూపంలో దారుణమైన పరాజయం ఆయన ఎకౌంట్ లో పడింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ – దర్శకుడు శ్రీను వైట్ల సినిమా సెట్స్ పైకి వచ్చింది. మొత్తానికి గోపీచంద్ సినిమాలు ఈమ‌ధ్య ఏం ఆడలేదు. హీరోగా త‌న నుంచి సాలిడ్ సినిమా పడి చాలా కాలం అయ్యింది. దీనికితోడు అటు శ్రీను వైట్ల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. మరి ఇలాంటి ప్లాప్ కాంబినేషన్ లో ఓ సినిమా ప‌ట్టాలెక్కింది. దీనికి `రెబల్` అనే పేరు పెట్టబోతున్నారు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం.. గోపీచంద్ కి పెద్ద‌గా మార్కెట్ లేదు.

అటు ఓటీటీని న‌మ్ముకొని కూడా సినిమా తీసేంత ధైర్యం ఎవ‌రికీ లేదు. ఓవరాల్ గా గోపీచంద్ తో సినిమా అంటే రూ.35 – 40 కోట్ల మ‌ధ్యే పూర్త‌వ్వాలి. కానీ, దర్శకుడు శ్రీను వైట్ల బాగా ఖర్చు పెట్టిస్తున్నాడు. అటు గోపీచంద్ అయితే మరీ విపరీతంగా డిమాండ్ చేస్తున్నాడు అని టాక్. పైగా షూటింగ్ లొకేషన్స్ ను కూడా గోపీచందే డిసైడ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే వార‌ణాసిలో ఓ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ ఒక్క షెడ్యూల్‌ కే రూ.3.5 కోట్లు అవుతాయని టాక్. కేవలం ఒక్క షెడ్యూల్ కే ఇంత భారీగా అయితే.. ఇక మిగిలిన భారీ షెడ్యూల్స్ పరిస్థితి ఏమిటి ?.

Also Read:ఆమె స‌మంతను మారుస్తానంటుంది

అసలు సినిమా పూర్త‌య్యేస‌రికి ఏ 60 కోట్లో లెక్క తేలుతుంద‌ని నిర్మాత కంగారు ప‌డుతున్న‌ట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్‌. అయితే, గోపీచంద్ మాత్రం `బాగా ఖ‌ర్చు పెట్టండి.. అప్పుడే క‌దా క్వాలిటీ సినిమా వ‌స్తుంది` అంటున్నాడట‌. అటు దర్శకుడు శ్రీను వైట్ల మాట అదేనట. అంతే కాదు. ఓటీటీ బిజినెస్ నేను చూసుకొంటా, మ‌న బ‌డ్జెట్ అంతా ఓటీటీ నుంచే వ‌చ్చేస్తుంద‌ని నిర్మాత‌కు భ‌రోసా ఇస్తున్నారట‌ ఈ ఇద్దరు.

Also Read:ప్రేమలో పడి 100 సినిమాలు వదులుకుందట!

- Advertisement -