మొక్కలునాటిన యంగ్ ఎంట్రప్రెన్యూరర్ హర్ష వర్ధన్ రెడ్డి

131
green india challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంట్రప్రెన్యూరర్ హర్ష వర్ధన్ రెడ్డి తన జన్మదినం పురస్కరించికొని తన సతీమణి రజనితో కలిసి తన కాలనీ పార్క్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా తను మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నారు ,దానిలో నావంతు సహకారాన్ని అందిస్తునందుకు అందంగా ఉందని తెలిపారు.

మొక్కలు నాటి , వాటిని ఎదిగేలా బాధ్యత తీసుకుంటూ , అడవులను దత్తత తీసుకునే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు . ఇప్పటివరకు 6000 ఎకరాలకు పైగా అడవులకు రక్షణ కల్పిస్తునందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు . ఈ గ్రీన్ ఛాలెంజ్ తన మిత్రులకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -