మొక్కలు నాటిన బుల్లి తెర నటుడు హర్ష చాగంటి

305
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లితెర నటుడు హరికృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నల్లకుంట లోని పార్క్ లో మొక్కలు నాటిన బుల్లి తెర నటుడు హరికృష్ణ చాగంటి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాలు చేపట్టి మన అందరికీ ఉపయోగపడే విధంగా మొక్కలు నాటించడం జరుగుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నేను నా సహచర నటులు ప్రభాకర్ పోడకార్ల; శివకుమార్ కాముని; పూజిత రెడ్డి ;నిఖిల్ నాయర్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ కాలనీ వాసులు పాల్గోన్నారు.

- Advertisement -