సాయికృప నగర్‌లో పర్యటించిన మంత్రి హరీష్..

200
harishrao
- Advertisement -

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని సాయి కృపనగర్‌లో పర్యటించారు మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. స్ధానికంగా ఏడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ రావడంతో పర్యటించిన హరీష్‌..స్ధానికులతో మాట్లాడారు.

మయూరి నగర్, సాయి కృప నగర్ లో 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని…ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ప్రాంతంను కంటోన్ మెంట్ జోన్‌గా ప్రకటించామని ఇక్కడ ఉన్న 4 వేల కుటుంబాలు బయటకు రావద్దన్నారు.

మీకు ఏ అవసరం ఉన్న ప్రభుత్వం కు తెలియజేయాలని..కరోన ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్న 7702411150 నెంబర్ తెలియజేయాలన్నారు. కరోన పాజిటివ్ వచ్చిన వారిని కలిసినప్రైమరీ కాంటాక్ట్స్ ప్రభుత్వం తెలియజేయాలన్నారు.

- Advertisement -