Harishrao:రాష్ట్రం గొంతెండిపోతోంది

9
- Advertisement -

రాష్ట్రం లో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు…సీఎం రేవంత్‌ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రం గొంతెండిపోతున్నది. గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి..పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు.మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదన్నారు. పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్ళయినా ఇవ్వాలని కోరుతున్నాను అని తెలిపారు.

- Advertisement -