బీఆర్ఎస్‌కు జై కొట్టిన లింగాయత్‌లు..

38
- Advertisement -

జహీరాబాద్‌లో లింగాయత్ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ ఎన్నికల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుకి మద్దతు తెలిపిన లింగాయత్ సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన రైతు బంధుపై కుట్రను వివరించాలన్నారు. తెలంగాణ రైతులు ఓటుతో కాంగ్రెస్ కి పోటు పొడవాలి. కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి. లేదంటే రైతు బంధు ఖతమైతదని…మాణిక్ రావుని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గానికి 6 వేల డబల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తాం అన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంటే బిచ్చమేస్తున్నరని కాంగ్రెస్ చెప్తోందని…రైతు బంధుకు ఈసీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పినా. ఇందులో కొత్త విషయం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చైర్మెన్ నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడ బుక్క ఆపిండ్రు. ఎన్నిరోజులు ఆపుతరు. మూడు తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే. తర్వాత రోజు టింగు టింగుమని పైసలు అకౌంట్ల పడతాయన్నారు.

రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం…2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదన్నారు. కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం. లక్ష ఎకరాలకు నీళ్లిస్తాం అన్నారు.

Also read:రైతు బంధును ఆదరించండి..రైతు రాబంధును తరిమికొట్టండి

- Advertisement -