Harish:ఓటుతో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పండి

10
- Advertisement -

2014లో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితో ఈ 2024లోనూ గెలిపించాలి… నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో గెలుస్తాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాట్లాడిన హరీష్..ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. ఆ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు.

స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు. వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారన్నారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత..ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయనను పార్లమెంటుకు పంపాలన్నారు.ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి… రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి. అతనితో జాగ్రత్తగా ఉండాలి..కాంగ్రెస్ నేతలు వందరోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకున్నారు.కాంగ్రెస్ పాలనకు వందరోజులు నిండాకే కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.

ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహిళలకు 2500లనే అమలు చేయలేదు..2 లక్షల రుణమాఫీ, వడ్లకు 500 బోనస్, 4 వేల ఫింఛన్, 15 వేల రైతుబంధు, తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు 5 లక్షల బ్యాంకు కార్డు, వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు హరీష్. మాట తప్పిన కాంగ్రెస్‌కు ఓడించి బుద్ధి చెప్పాలి..నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని రేవంత్ చెప్పిండు. ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చింది. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పిండు..కేసీఆర్ మాటంటే మాటే. అధికారంలోకి రాగానే 200 పెన్షన్‌ను వెయ్యి చేసిండు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పింఛన్ 2 వేలు చేసిండు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో ఆ పార్టీ మెడలు వంచాలన్నారు.

Also Read:Janasena:’గ్లాసు’తో జనసేనకు ఇబ్బందే!

- Advertisement -