Harish:ఉచిత బస్సు తప్ప..అంతా తుస్సే

12
- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరఫున భీమదేవరపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి.. కాంగ్రెస్, బిజెపి అబద్ధాల ప్రచారాలతో మోసపూరిత ప్రసంగాలతో తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయన్నారు. ఆరు గ్యాంరటీల్లో ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు…ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే హామీల అమలు గురించి ప్రశ్నించాలి..కేసీఆర్ కష్టకాలంలోనూ రైతబంధు ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. అక్కచెల్లెళ్లకు 2500 ఇస్తామని మోసం చేశాడు. 4 వేల పింఛన్ ఇస్తామని అవ్వాతాతలను మోసం చేశాడన్నారు.ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోని కాంగ్రెస్‌ను నమ్మి మళ్లీ మోసపోదామా? ,రేవంత్ రెడ్డికి తిట్లు లేకపోతే ఒట్లు. అప్పుడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్స్ మీద ప్రామిస్ లు. కాంగ్రెస్ బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయి. దానికి ఎంపీ ఎన్నికల్లో శిక్ష వేయాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు తో రాజకీయం చేస్తున్నారు. ఇంక నయం హుస్నాబాద్ కి రాలేదు. వస్తే కొత్తకొండ వీరభద్ర స్వామి మీద ఒట్టు పెడుతుండే. వీరభద్ర స్వామి చాలా పవిత్రమైన మహిమ గల్లోడు. మాట ఇస్తే తప్పనోడు. నాయనా. రేవంత్ రెడ్డి ఇటుపక్క రాకు, మా వీరభద్ర స్వామి మీద ఒట్టు పెట్టకు..భీమదేవరపల్లిని, ముల్కనూరును గౌరవించి, ఇక్కడి అభ్యర్థికి టికెటిచ్చింది కేసీఆర్ అన్నారు.ఆరు గ్యారెంటీలు అంటారు. ముల్కనూర్ బిడ్డ ప్రవీణ్ కుమార్ కే గ్యారెంటీ లేకుండా పోయింది.. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

Also Read:వేసవి రద్దీ..వీఐపీ బ్రేక్ రద్దు

- Advertisement -