బీజేపీ పై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్..

94
harishrao
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ పై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అన్నాఉఉ మంత్రి హరీశ్‌ రావు. .సిద్దిపేట లో పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ….బీజేపి నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరన్నారు. పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు… బిజెపి మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందన్నారు.

కేంద్ర బిజెపిలో ఆధిపత్య పోరు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నారన్నారు. బిజెపిది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పా అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలని…. పదవులు వచ్చిన వారు ప్రజల కోసం పని చేయాలన్నారు.

క్యాడర్ లేకుంటే పార్టీ లేదు.. కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలు అన్నారు. అన్ని పార్టీల నేతలు వచ్చి సిద్దిపేట అభివృద్ధి మీద ఏడుస్తారు.. మరి ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారన్నారు. సిద్దిపేట పదిమందికి ఆదర్శంగా నిలుస్తుందని… సిద్దిపేట మున్సిపాలిటీ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. విద్యాక్షేత్రంగా, ఆలయాలకు, జలాశయాలకు ఖిల్లా గా మారిందన్నారు.

- Advertisement -