Harishrao:ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కాంగ్రెస్

80
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందన్నారు మంత్రి హరీష్‌ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదన్నారు. బీ ఆర్ ఎస్ కే కాదు బిజెపి ఎంఐఎం పార్టీలో కూడా మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసిందన్నారు.

సత్య దూర మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. డెమోక్రాటిక్ గా ఉంటామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వలేదని…మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. పీవీ నరసంహారావు చనిపోతే కనీసం నివాళులు అర్పించలేదు, కనీసం వెళ్లి చూడలేదు కాంగ్రెస్ పార్టీ అన్నారు.

గుంటెడు జాగా కూడా ఇవ్వలేదని…అంజయ్య ను అవమనించింది కాంగ్రెస్ కాదా అన్నారు.అమరులను ప్రతి సారి నివాళులు అర్పించిన తర్వాతే కేసిఆర్ పనులు మొదలు పెడుతారని..సచివాలయం ముందు అమరుల స్థూపం ముందు కట్టింది బీ ఆర్ ఎస్ అన్నారు. జై తెలంగాణ అంటే కాల్చేస్తే అంటూ గన్ను పట్టుకొని వచ్చింది రేవంత్ రెడ్డి అన్నారు. యాది రెడ్డి శవాన్ని రేవంత్ రెడ్డి కనీసం చూడలేదని..అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి..కేసులే లేవని అసెంబ్లీలో చెప్పటం సరికాదన్నారు.

Also Read:సీఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కావొద్దు..

- Advertisement -