పార్టీ మారకపోతే అక్రమకేసులు:హరీష్

14
- Advertisement -

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ మారకపోతే అక్రమ కేసులు.. దాడులు.. బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్.. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందన్నారు.

అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందని…వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎం వచ్చింది..ఆయన ఏమైనా బంధిపోటా..FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి..బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్న ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారు…ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారన్నారు. మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారు..కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి…వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయన్నారు.

BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు…ఇప్పటికి మూడు కేసులు పెట్టారన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు..గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు…పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరన్నారు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని…ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం అన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం అన్నారు.

Also Read:Harish:కాంగ్రెస్‌ పాలన అంటే విచారణ,వేధింపులు

- Advertisement -