Harishrao:కాళేశ్వం అద్భుతం..అసత్యాలు తగదు

13
- Advertisement -

కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం తీరు మసి పూసి మారేడు కాయ లాగా చేసినట్టు ఉందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓట్ల కోసం కాళేశ్వరం ప్రోజెక్ట్ ను వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని…మేడి గడ్డ కు వెళ్ళే ముందు అన్నపూర్ణ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మిగితా ప్రాజెక్టులు వెళ్తే బాగుండేదన్నారు. మీరు ఎంత దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రోజెక్ట్ ఒక అద్భుతం అన్నారు. బోరు బావుల్లో, భూమి లో గ్రౌండ్ వాటర్ పెరిగుందంటే దానికి కారణం కాళేశ్వరం అన్నారు.

మేడిగడ్డ కుంగుంది అంటే మొత్తం కాళేశ్వరం ప్రోజెక్ట్ పనై పోయింది అన్నట్టు చేస్తున్నారని..విచారణ చేయండి, మరమత్తులు చేపట్టండి అని మేము చెప్పాం అన్నారు. పులిచింతల, కుట్టం గండి, పంజాగుట్ట ఫ్లై ఓవర్ కాంగ్రెస్ హాయం లో కూలిందని…అన్నమయ్య, పోలవరం ప్రాజెక్టులు కూలింది కూడా కాంగ్రెస్ హయం లోనే అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ చూపించి అద్బుతం అని చెప్పింది మీరే కదా? అన్నారు.

లక్ష ఎకరాలకు నీళ్ళు వదులుతున్నమని మంత్రి కొండా సురేఖ అన్నారు కదా…నిన్న 94 వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పటం ఏంటి? అన్నారు. మీ లెక్కలే మీకు అర్దం కావటం లేదా?…పంటలను కాపాడుకున్నాం.17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసుకున్నామన్నారు. మా మెదక్ జిల్లాలో హల్దీ వాగు,కూడవెళ్లి వాగు ద్వారా ఇదే కాళేశ్వరం జలలల్తో నీళ్లు ఇచ్చింది నిజం కాదా…నిజాలు దాచిపెడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

Also Read:కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు:కడియం

- Advertisement -