Harishrao: రైతు ఆత్మహత్య బాధాకరం

1
- Advertisement -

గాంధీ ఆసుపత్రిలో మార్చారీలో ఉన్న సురేందర్ రెడ్డి డెడ్ బాడీని చూసి నివాళులు అర్పించారు మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు హరీశ్‌.

పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని తెలిపారు. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తం అన్నారు. ముఖ్యమంత్రి .. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు అన్నారు.

దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండన్నారు.

Also Read:పాలమూరు ఎత్తిపోతలను పడావు పెడతారా?

- Advertisement -