రైతు బంధు పంపిణీపై మంత్రుల సమీక్ష

243
harish rao
- Advertisement -

హైదరాబాద్ అరణ్య భవన్‌లో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాల పంటకు సంబంధించిన రైతు బంధు పంపిణీపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక, వ్యవసాయ ‌శాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణా రావు, జనార్థన్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు హాజరయ్యారు.

ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్ల ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయనున్నారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడనుంది ప్రభుత్వం.

- Advertisement -