రాష్ట్రమంతటా పండగలా పార్టీ సభ్యత్వ నమోదు-హరీష్ రావు

214
Mla harish rao
- Advertisement -

నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జివన్ రామ్ భవన్‌లో జరిగిన 14 వ వార్డ్ trs పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంర్భంగా హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడికి పోయిన trs పార్టీ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పార్టీ trs పార్టీ. సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా70 వేల మంది సభ్యత్వం తీసుకున్నారు. ప్రజలే స్వచ్చందంగా క్యూ లైన్లలో నిలబడి సభ్యత్వం తీసుకుంటున్నారు. ప్రజలకు భరోసా కలిపిస్తున్న పార్టీ trs పార్టీఅని ఆయన అన్నారు.

harish rao

సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమా2లక్షలు ఇస్తున్నామని..సిద్దిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. గడిచిన5ఏండ్లలో14 వార్డ్ రూపు రేఖలు మరిపోయినాయి. ప్రజలకు ఆదర్శ పట్టణంగా ఉండేలా సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నాం.పట్టణములో2500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసినం త్వరలోనే కేసీఆర్ చేతుల మీదుగా పేదలకు అందిస్తాం.

కార్యకర్తలుగా మీరు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించాలి.పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేదించి, తడి, పొడి చెత్త వేరు చేయాలి.కార్యకర్తలకు పార్టీ ముఖ్యం, సిద్దిపేట పరిశుభ్రత ముఖ్యం.పట్టణ ప్రజలు నీటి వృధాను అరికట్టాలి.కార్యకర్తలు గా మీరు ఒకవైపు పార్టీ మరో వైపు పట్టణ పరిశుభ్రత పాటించాలని హరీష్‌రావు తెలిపారు.

- Advertisement -