బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా- మంత్రి హరీష్‌

216
harish
- Advertisement -

భారతీయ జనతా పార్టీ నాయకుల్లో రోజురోజుకు ఫ్రాస్టేషన్ పెరుగుతోంది. ఈరోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పఠాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం, అమిత్ షాతో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించిన ఫలితం లేకపోవడంతో వారిలో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని మంత్రి ఎద్దేవ చేశారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మక పోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారు.ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే ఆ నోబెల్ బహుమతి బీజేపీ పార్టీ కి వస్తుందని మంత్రి విమర్శించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున టీవీ9 లోగో వాడుకుని ఫేక్ ప్రచారం చేసి లబ్ది పొందాలని చూసారు. రేపు జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం ప్రధాన చాన్నాళ్ల లోగో లు వాడుకుని టీఆర్‌ఎస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. దయచేసి ప్రజాలేవరూ అలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు..ఎవ్వరూ సర్క్యులేట్ చేయవద్దు. సోషల్ మీడియాను పూర్తి స్థాయి ఫేక్ మీడియాగా బీజేపీ మార్చివేసింది. బలమైన సోషల్ మీడియా స్థాయిని దిగజార్చిందని మంత్రి మండిపడ్డారు.

ఎంత మంది నేతలు వచ్చి ప్రచారం చేసిన హైదరాబాద్ నగర ప్రజలు నమ్మట్లేదని అర్థమయ్యి ఫేక్ వార్తలు ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురిచేసేవిధంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. నాతో సహా ఇతర ముఖ్య నేతలపై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజాలేవరూ ఆ వార్తలను నమ్మొద్దు. టీఆర్‌స్ కార్యకర్తలేవరూ సంయమనం కోల్పోవద్దు అని మంత్రి సూచించారు.

- Advertisement -