ప్రజల కోసమే బీజేపీలోకి: హార్ధిక్ పటేల్

47
hardik
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ట్వీట్ చేసిన హార్ధిక్….ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పాల‌న‌ను కొనియాడారు. ప్ర‌జ‌ల కోసం బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తాన‌ని చెప్పారు.

దేశ‌, రాష్ట్ర, ప్ర‌జ‌ల‌, సామాజిక ప్ర‌యోజ‌నాల కోసం నేడు నేను ఓ కొత్త అధ్యాయాన్ని మొద‌లుపెట్ట‌నున్నాను. దేశానికి సేవ చేయ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో నేను ఓ చిరు సైనికుడిలా ప‌నిచేస్తాను అని చెప్పారు.

గుజ‌రాత్‌లో ప‌టీదార్ ఉద్య‌మంలో పాల్గొన్న హార్దిక్ ప‌టేల్ దేశ ప్ర‌జ‌లు, రాజ‌కీయ వ‌ర్గాల‌ దృష్టిని ఆక‌ర్షించారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరారు.

- Advertisement -