ఎంపీ జీతం ఒక్కరూపాయి తీసుకోను..అంతా వారికే: భజ్జి

62
harbhajan
- Advertisement -

ఆప్ నుండి ఇటీవలె రాజ్యసభకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భజ్జి కీలక ప్రకటన చేశారు. ఎంపీగా తనకు వచ్చే జీతంలో నుండి రూపాయి కూడా తీసుకోనని…ఆ డబ్బంతా రైతుల కుమార్తెల చ‌దువు, సంక్షేమం కోసం వినియోగించ‌నున్న‌ట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ దేశాన్ని మ‌రింత ఉన్న‌తంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపిన హర్భజన్… దేశం కోసం ఏదైనా చేస్తాన‌ని తెలిపారు. ఆప్ నుండి ఇటీవల ఐదుగురు రాజ్యసభకు ఎంపికకాగా అందులో ఒకరు హర్భజన్ సింగ్.

- Advertisement -