హాజీపూర్ హత్యల కేసు.. ఫిబ్రవరి 6కు వాయిదా

371
srinivas
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసును ఫిబ్రవరి 6కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పోక్సో ప్రత్యేక కోర్టు. ఈ కేసు తుది తీర్పు నేడు వెలువడించనుండగా మరోసారి వాయిదా వేసింది నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరకుంటున్నారు.

ఈనెల 7న ఈకేసును విచారించిన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పును 27కు వాయిదా వేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించిన నేపథ్యంలో ఫోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.

- Advertisement -