ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణస్వీకారం

717
gutha
- Advertisement -

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఇవాళ ఉదయం గుత్తా చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుత్తా ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహాచార్యులు గత సోమవారం అధికారికంగా ప్రకటించి.. గుత్తాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

- Advertisement -