సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీజేపీ: గుత్తా

258
gutha
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా…పశ్చిమ బెంగాల్‌లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమతా బెనర్జీని ఎం చేయలేకపోయారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సహజం, బీజేపీ ఓడిపోవడమూ అంతే సహజమని చెప్పారు.

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని కుతంత్రాలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని రోజే లేదన్నారు.

- Advertisement -