అచ్యుతరావు మృతిపట్ల గుత్తా దిగ్బ్రాంతి..

340
gutha sukender reddy
- Advertisement -

బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. అచ్యుత రావు మృతికి సంతాపం తెలిపారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన గుత్తా…బాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే గొప్ప వ్యక్తిని కోల్పోయాం అన్నారు.

గత 30 సంవత్సరాలుగా తనకు అచ్యుత రావు ,ఆయన కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం ఉందని… ఎప్పుడు కలిసిన సామాజిక సేవ కార్యక్రమాలు, బాలల హక్కుల గురించి ప్రస్తావించే వారని తెలిపారు.

ప్రతి నవంబర్ 14 రోజున బాలల దినోత్సవం సందర్భంగా అచ్యుత రావు మంచి కార్యక్రమాలు నిర్వహించే వారని…ఆయన కుటుంబ సభ్యులు, సోదరుడు ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ కి ఫోన్ కాల్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

- Advertisement -