మొక్కలునాటిన నటి రాజశ్రీనాయర్‌..

377
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి తిరుమల గిరిలోని తన నివాసం వద్ద తన పిల్లలతో కలిసి మొక్కలు నాటిన నటి రాజశ్రీ నాయర్.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది..ప్రకృతికి మనం మేలు చేస్తే మనకు ప్రకృతి మేలు చేస్తుంది..ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడంతో భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించిన వాళ్ళం అవుతాం..
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా సినీ దర్శకులు శివనిర్వాణ,జయశంకర్,ఆర్టిస్ట్ పృద్వి ముగ్గురిని కోరుతున్న.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

- Advertisement -