విజయలక్ష్మి పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన గుత్తా..

241
Gutha Sukender Reddy
- Advertisement -

తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి శ్రీమతి బోడకుంటి విజయలక్ష్మి పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.విజయలక్షి కుటుంబ సభ్యులను ఓదార్చి,.. పరామర్శించారు సుఖేందర్ రెడ్డి. ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.

సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,భాను ప్రసాద్,బాలసాని లక్ష్మీ నారాయణ, భూపాల్ రెడ్డి,గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్,మహబూబాద్ ఎంపీ కవిత, తదితరులు కూడా బోడకుంటి విజయలక్షికి నివాళులర్పించారు.

- Advertisement -