బోడకుంటి వెంకటేశ్వర్లును పరామర్శించిన ఎర్రబెల్లి..

249
minister errabelli dayakar
- Advertisement -

తెలంగాణ శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడఖతో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లును పరామర్శించారు మంత్రి ఎర్రబెల్లి. విజయలక్ష్మి మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, భాను ప్రసాద్ రావు, బాలసాని లక్ష్మీ నారాయణ, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తదితరులు కూడా బోడకుంటి విజయలక్షి గారికి నివాళులర్పించారు.

- Advertisement -