తెలంగాణ దేశానికే ఆదర్శం: గుత్తా

351
Gutha Sukender Reddy
- Advertisement -

నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్దూపానికి, శ్రీకాంతా చారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్ర ఆవిర్భవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. అనతికాలంలోనే తెలంగాణాను దేశంలోనే అగ్రస్ధానంలో నిలిపారు ముఖ్యమంత్రి కెసీఆర్. అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది అని గుత్తా అన్నారు.

కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమానికి పెద్ద పీట వేసి పేదల్ని, వలస కార్మీకుల్ని ఆదుకున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 మెడికల్ కళాశాలలు, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేయడం అద్బుతం అన్నారు. జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అవుతున్నాయని గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -