అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..

18
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అయోవాలోని డెస్‌ మోయిన్స్‌లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఓ టీచర్‌కి గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇటీవల కాలిఫోర్నియాలో చైనీస్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో దుండగులు కాల్పులు జరుపగా.. పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -