సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌..

13
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో అదుపులోకి తీసుకోగా తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందాయి.

ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని…అయితే, పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున ఇవాళ విచారణకు రాలేనని లిఖిత పూర్వకంగా తెలిపారు.

మరో తేది ఇవ్వాలని అప్పుడు తప్పకుండా విచారణకు వస్తానని తెలిపారు అవినాష్‌. ఇక ఇప్పటికే అవినాష్‌ తండ్రి భాస్కర్ రెడ్డి వివరాలను ఆరా తీశారు సీబీఐ అధికారులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -