లక్నోపై రాజస్థాన్…చెన్నైపై గుజరాత్ గెలుపు

104
gujarath
- Advertisement -

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. కీలక మ్యాచ్‌లో లక్నో చేతులెత్తేసింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 154 పరుగులు మాత్రమే చేసి 24 పరుగులతో ఓటమి పాలైంది. హుడా 39 బంతుల్లో 59 పరుగులు చేయగా కృనాల్ పాండ్య(25), మార్కస్ స్టోయినస్(27) పరుగులు చేశారు. ఇక అంతముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్…నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 178 పరుగులు చేసింది. జైస్వాల్ 41,పడిక్కల్ 39,సామ్సన్ 32 పరుగులు చేశారు.

ఇక మరో మ్యాచ్‌లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై విధించిన 134 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి మాత్రమే చేధించింది. ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా (67*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిన గుజరాత్‌కు ఈ సీజన్‌లో ఇది పదో విజయం కాగా, చెన్నైకి తొమ్మిదో ఓటమి.

- Advertisement -