మోడీ ఇలాఖాలో పాతనోట్లు సీజ్‌…ఎన్ని కోట్లో తెలుసా?

201
old notes
- Advertisement -

2018 నవంబర్ 8. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోడీ సర్కార్‌ సంచలన నిర్ణం తీసుకుంది. అనంతరం నోట్ల రద్దుకు సమయం కేటాయించారు. గడువు పూర్తి కావడంతో ఇప్పటివరకు పలు సందర్భాల్లో పాతనోట్లు పట్టుబడుతు వస్తూనే ఉన్నాయి.

అయితే రద్దైన రెండు సంవత్సరాల తర్వాత ఏకంగా రూ. 3.5 కోట్లు పట్టుబడ్డాయి. అది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వంతరాష్ట్రం గుజరాత్‌లో. బిలిమోరాలో కారులో తరలిస్తున్న పాతనోట్లను స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

13,432 వెయ్యిరూపాయల పాత నోట్లు,రూ.500ల విలువగల 43,300 నోట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం. ఈ డబ్బు ఎవరిది….ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -