గణేశ్‌ నిమజ్జనం…సీపీసీబీ మార్గదర్శకాలివే!

248
ganesh nimajjan
- Advertisement -

వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో నిమజ్జనానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ).ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ), థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ వాడకంపై పూర్తిగా నిషేధం విధించిన సీపీసీబీ…గణేశ్‌ నిమజ్జన వ్యర్ధాలను తొలగించేందుకు విసర్జన్ ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. లక్ష జనాభా మించిన టైర్‌ -1 నగరాల్లో పీసీబీ అధికారులు పర్యవేక్షణ జరుపాలని వెల్లడించింది.

సీపీసీబీ గైడ్ లైన్స్‌ ఇవే….

()విగ్రహాలను సహజ రంగులతోనే అలంకరించాలి. ఎండిన ఆకులు, పూలు, బెరడులతో తయారుచేసిన రంగులనే వినియోగించాలి.
()నవరాత్రుల్లో భాగంగా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషిద్ధం. ఎకో ఫ్రెండ్లీ వస్తు సామగ్రిని మాత్రమే వినియోగించాలి.
()నిమజ్జన కొలనులను శుభ్రం చేయడానికి, శానిటైజేషన్‌ కోసం, వ్యర్థాలు తొలిగించేందుకు విసర్జన్‌ చార్జీలను వసూలుచేయాలి.
()విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలికంగా నిమజ్జన కొలనులను ఏర్పాటుచేసుకోవాలి. విగ్రహాలను నిమజ్జనం చేశాక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించాలి.
()విగ్రహాలతోపాటు వచ్చే పూజా సామగ్రి, పూలవంటి వాటిని ముందుగానే తొలిగించి, కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనంచేయాలి.

- Advertisement -