ఐసీసీ నూతన ఛైర్మన్గా గ్రేగ్ బార్క్లే ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఓటింగ్లో తాత్కాలిక ఛైర్మన్గా ఉన్న ఇమ్రాన్ ఖ్వాజాను ఓడించారు బార్క్లే. బార్క్లేకు పది ఓట్లు రాగా ఖ్వాజా ఖాతాలో ఆరు ఓట్లు పడ్డాయి. దీంతో బార్క్లే ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
తనకు మద్దతు ఇచ్చిన ఐసీసీ డైరక్టర్లకు థ్యాంక్స్ చెప్పారు బార్ క్లే. కరోనా మహమ్మారి నుంచి క్రికెట్కు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసీసీ ఈవెంట్ల కన్నా ముందు ద్వైపాక్షిక సిరీస్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా బార్క్లే తెలిపారు.
కమర్షియల్ లాయర్ అయిన బార్క్లే.. న్యూజిలాండ్ క్రికెట్ డైరక్టర్గా 2012 నుంచి పనిచేశారు. న్యూజిలాండ్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో జరిగిన 2015 వరల్డ్కప్కు డైరక్టర్గా కూడా చేశారు.