మొక్కలు మనకు ప్రాణాధారం : ఎస్పీ వెంకటేశ్వర్లు

53
venkateshwarlu
- Advertisement -

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ. జే. రంజన్ రతన్ కుమార్, కామారెడ్డి జిల్లా ఎస్పీ. బి. శ్రీనివాస్ రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన….. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో, పోలీస్ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటాలని చెప్పారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో ఋతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహితమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నదిన్నారు.

అనంతరం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ రాఘవరావు, సిఐ. శ్రీకాంత్ రెడ్డి, సుపర్డెంట్ శంకర్ లాల్,ఎస్సైలు సురేష్ గౌడ్, శంషోద్దిన్, శివ నాగేశ్వర్ నాయుడు, వసంత, సునీత, డిపిఓ స్టాప్, ఎస్బి స్టాప్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, హోంగార్డ్స్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -