కవితక్కకు ఘనస్వాగతం…

263
- Advertisement -

బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా పలు దేశాల్లో పర్యటన ముగించుకుని ఎంపీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎంపీ కవితకు ఘన స్వాగతం లభించింది. జాగృతి కార్యకర్తలు, టీఆర్ఎస్ నేతలు కవిత ఎయిర్ పోర్టులో పూల బొకెలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి చేరుకున్నారు. విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను ముగించుకుని వచ్చిన కవితను తల్లి శోభ ఆశీర్వదించారు.

MP Kavitha

9 దేశాల్లో జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.తెలంగాణ ఎన్నారైలే కాకుండా విదేశీయులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమెరికాలో నిర్వహించిన ఉత్సవాలకు భారత రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్, ప్రీమాంట్ సిటీ మేయర్, వైస్ మేయర్ హాజరయ్యారు. దుబాయ్ ఉత్సవాలకు ఎంబసీ సాంస్కృతిక విభాగం ఇన్‌చార్జి హాజరయ్యారు. బహ్రెయిన్ ఇండియాన్ డిప్యూటీ అంబాసిడర్ కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా జాగృతి చేపట్టిన బంగారు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా చేస్తూ అందరితో జయహో అనిపించుకుంటున్నది.

- Advertisement -