లండన్‌లో మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం

92
ktr
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లండన్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా లండన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ అనిల్ కుర్మాచలంతో పాటు నాయకులు పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.

ఇక లండన్‌ నుండి స్విట్జర్లాండ్‌కు వెళ్లనున్నారు కేటీఆర్. దావోస్‌లో ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు కేటీఆర్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రసంగించనున్నారు. కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారాలు ఉన్నారు.

- Advertisement -