పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు!

3
- Advertisement -

22 శాతం, 25 శాతం, 27 శాతం మరియు 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మినహాయింపులను పొడిగించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధన మిశ్రమాలకు ఎక్సైజ్ సుంకం రేటు పూర్తిగా (సున్నా) ఉంటుందని ప్రకటించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ భారత గెజెట్‌లో ప్రచురించిన అధికారిక నోటిఫికేషన్ల ద్వారా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. సున్నా శాతం సుంకం ప్రయోజనాన్ని పొందడానికి ప్రతి మిశ్రమానికి చట్టబద్ధమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

గెజెట్ ప్రకారం.. “22% ఇథనాల్ కలిపిన పెట్రోల్ మిశ్రమంలో: (ఎ) పరిమాణం (వాల్యూమ్) పరంగా 78% మోటార్ స్పిరిట్ (సాధారణంగా పెట్రోల్ అని పిలుస్తారు) ఉండాలి, దీనిపై తగిన ఎక్సైజ్ సుంకాలు చెల్లించి ఉండాలి. అలాగే 22% ఇథనాల్ ఉండాలి, దీనిపై తగిన కేంద్ర పన్ను, రాష్ట్ర పన్ను, కేంద్రపాలిత ప్రాంత పన్ను లేదా ఇంటిగ్రేటెడ్ పన్ను చెల్లించి ఉండాలి. (బి) ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ IS 19850 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అన్నారు.

ఇదే విధమైన నిబంధనలు అంతకంటే ఎక్కువ శాతం ఉండే మిశ్రమాలకు కూడా వర్తిస్తాయి. ఈ ఆర్థిక చర్యలో భాగంగా గెజెట్ గరిష్టంగా 30 శాతం మిశ్రమానికి సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టం చేసింది. 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్ మిశ్రమంలో పరిమాణం పరంగా 70% పెట్రోల్ (తగిన ఎక్సైజ్ సుంకాలు చెల్లించినది) మరియు 30% ఇథనాల్ (తగిన కేంద్ర, రాష్ట్ర, లేదా ఇతర పన్నులు చెల్లించినది) ఉండాలి. ఇది కూడా BIS స్పెసిఫికేషన్ IS 19850 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అని గెజెట్ పేర్కొంది.

Also Read:టీమిండియాకు భారీ షాక్

నోటిఫికేషన్‌లోని వివరణ ప్రకారం.. తగిన ఎక్సైజ్ సుంకాలు అంటే సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్, 1944 యొక్క నాల్గవ షెడ్యూల్ కింద విధించదగిన ఎక్సైజ్ సుంకాలు, ఫైనాన్స్ యాక్ట్, 2018 పరిధిలోని అదనపు ఎక్సైజ్ సుంకం, మరియు ఫైనాన్స్ యాక్ట్, 2002 కింద విధించబడే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను సూచిస్తుంది. ఇందులో ఫైనాన్స్ యాక్ట్, 2021 కింద విధించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్) కూడా కలిసి ఉంటుందని వివరించారు.

- Advertisement -