శ్రీవారి సేవలో గవర్నర్ తమిళిసై..

59
- Advertisement -

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ…ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.

- Advertisement -