గవర్నర్ తమిళి సై రాజీనామా

26
- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళి సై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్‌ నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం.

Also Read:Jagan:జగన్ కు వాలెంటిర్లతో నో యూజ్!

వృత్తి రిత్యా డాక్టర్ అయిన తమిళి సై..తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా సేవలందించారు. 2019 సెప్టెంబర్ 8న రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టగా 2021లో పుదుచ్చేరి అదనపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండుసార్లు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

- Advertisement -