అభివృద్ధికి తెలంగాణ నిద‌ర్శ‌నం‌: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

133
governor
- Advertisement -

ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగించారు. అంద‌రికీ న‌మ‌స్కారం అని తెలుగులో చెప్పి.. త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచింద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల పురోగ‌తికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. పారిశ్రామికీక‌ర‌ణ ద్వారా ఉద్యోగ అవ‌కాశాలు పెంచామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తోంద‌ని గవర్నర్‌ తెలిపారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న ప‌థ‌కాలు రూపొందించామ‌ని తెలిపారు. ఎన్నో ఇబ్బందుల నుంచి నిల‌దొక్కుకున్నామ‌ని చెప్పారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకెళ్తుంద‌న్నారు. అభివృద్ధికి నిద‌ర్శ‌నం తెలంగాణ‌, తెలంగాణ ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించింది. అభివృద్ధిలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచింద‌న్నారు. కాగా,ఈ స‌మావేశాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -